శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (15:38 IST)

కేసీఆర్ పేషికి స్మితా సబర్వాల్- సచివాలయం నుంచి అవుట్!

స్మితా సబర్వాల్ సెక్రటరియేట్‌ను వీడనున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అత్యుత్తమ పనితీరు కనబరచి సీఎం కార్యాలయానికి అదనపు కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ సచివాలయాన్ని వీడనున్నారని తెలిసింది. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ పనితీరుకు ముచ్చటపడి సీఎం పేషీకి పిలిపించుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి విజ్ఞప్తులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ఆమెను ఆ జిల్లాకు కలెక్టర్‌గా నియమించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఆమెపై పని ఒత్తిడి పెరిగిపోతోందని గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సీఎం పేషీలో కీలకమైన నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల భాధ్యతలు నిర్వర్తిస్తూ మహిళా రక్షణ బిల్లును రూపొందించే కమిటీలో ఆమె విధులు నిర్వర్తించారు.