శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (13:32 IST)

బీజేపీ ఎమ్మెల్యేను హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలంటున్న నెటిజన్లు... ఎందుకు?

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. హైదరాబాద్ పరిధిలోని గోషా మహల్ స్థానం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. ఇక్కడ అత్యధికంగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. వీరంతా రాజా సింగ్‌కు ఓటు వేయడం వ్లలే ఆయన గెలిచారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
కానీ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా ముస్లిం సీనియర్ నేత, మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేశారు. దీనికి రాజాసింగ్ నిరసన తెలిపారు. ముస్లింనేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నంతకాలం అసెంబ్లీలో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
స్పీకర్‌కు ప్రొటెం స్పీకర్‌కు తేడా తెలియని రాజా సింగ్ నీ అజ్ఞానంతో జనాలను కన్ఫ్యూస్ చేయకు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొదరు అయితే, అవును, నీవు అసెంబ్లీకి వెళ్లకు. అసెంబ్లీని నిర్మించింది కూడా ముస్లిం రాజే. గోషా మహల్‌ను కూడా నువ్వు వదిలేయ్. గోషామహల్‌ను ముస్లింలే కట్టారు. హైదరాబాద్‌ను ముస్లిమే నిర్మించాడు. అందువల్ల హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపో. 
 
హైదరాబాద్‌లో హిందూముస్లింలు గంగా యమునా నదులా కలిసిమెలిసి ఉంటున్నారనీ, ఆ విషయం నీకు అర్థంకాదు. అందువల్ల నీవు రాజస్థాన్‌కు వెళ్లిపో. అక్కడకు వెళ్లి ఏదేని పని చూసుకో. హైదరాబాద్ సంస్కృతి నీకు అర్థంకాదు అంటూ రాజా సింగ్‌ను చీవాట్లు పెడుతున్నారు నెటిజన్లు. రాజకీయాల కోసం హైదరాబాద్ నగర ప్రజల మధ్య అలజడులు సృష్టించాలనుకుంటే నీ పప్పులుడకవ్ అంటూ హెచ్చరిస్తున్నారు.