1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: మంగళవారం, 27 నవంబరు 2018 (21:20 IST)

గోశామహల్ స్థానంలో పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి కిడ్నాప్???

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్‌లో నివాసముండే ట్రాన్స్‌జండర్ చంద్రముఖి. ఈ రోజు తెల్లవారు జాము నుంచి కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు పలువురు ట్రాన్స్‌జండర్స్. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిడ్నప్ చేశారని బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసారు.
 
పోలీసులు రంగంలోకి దిగారు. ఇది తెలిసినవారి పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. గోశామహల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ట్రాన్స్‌జండర్ చంద్రముఖి పోటీ చేస్తున్నారు. గోశామహల్ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యే రాజసింగ్ బరిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో చంద్రముఖి కిడ్నాప్ కావడం గమనార్హం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.