శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (07:57 IST)

సీఎం ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయ్: స్పీకర్ కోడెల

మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ లాంజ్‌లో కేవలం సభాపతులు ఫోటోలు మాత్రమే ఉంటాయని కోడెల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని కోడెల అన్నారు. 
 
రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ అనుమతులు లేకుండా ఎవరి ఫొటోను పెట్టలేమని అన్నారు. గతంలో వైయస్ ఫొటో పెట్టినప్పుడు ఆ నిబంధనను పాటించలేదని చెప్పారు.
 
ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కేవీపీ తనకు లేఖ రాసి, సభను కించపరిచారని కోడెల వ్యాఖ్యానించారు. కేవీపీ రాసిన లేఖను మీరు సమర్థిస్తారా? అంటూ వైకాపా సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. వైఎస్సార్ ఫోటో పడిపోయేలా ఉంటే దాన్ని తీసి భద్రపరచమని నేనే చెప్పానని కోడెల అన్నారు. కమిటీ హాలులోనే సీఎం ఫోటోలు పెట్టాలని.. అలా పెట్టాల్సి వస్తే సంవత్సరాల వారీగా అప్పటి సీఎం ఫోటోలు పెట్టాలన్నారు.