శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (09:03 IST)

సిద్దిపేటలో స్వైన్ ఫ్లూ : ఒకరు మృతి..!

ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్‌పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా తగ్గకపోవటంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. 
 
వైద్య పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధిగా నిర్థారించారు. నాలుగురోజుల చికిత్స అనంతరం డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దేవరాజ్ మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య శారద, ముగ్గురు కుమారులు వున్నారు.