వైఎస్ ఆత్మ కేసీఆర్లో ప్రవేశించినట్టుంది: నరేందర్ రెడ్డి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కర్నె ప్రభాకర్ భూముల ఆక్రమణ అంటూ సంచలన వ్యాఖ్యలపై టీడీపీ ధీటుగా స్పందించింది. వైయస్ ఆత్మ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో ప్రవేశించినట్లుగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి నరేందర్ రెడ్డి అన్నారు.
వైయస్ ఆత్మ కేసీఆర్లో ప్రవేశించినట్టుందన్నారు. తనతో పాటు తన మనుషుల చేత మాట్లాడించే మాటలతో తెలంగాణలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు.
తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, హామీల అమలుకు ఎంత వ్యయమవుతుందో తెలుపుతూ ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు విచారణలతో కాలయాపన చేయవద్దని తెలిపారు.