తెదేపా నాయకులు ముగ్గుర్ని కిడ్నాప్ చేసిన మావోలు... రక్షించండి... రక్షించండి...
విశాఖలో మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు ఈ ఉదంతం తెలుపుతోంది. సోమవారంనాడు విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం కొత్తగూడలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ అయిన వారిలో మండల టిడిపి అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, టిడిపి నాయకులు మహేశ్, బాలయ్యలున్నారు.
ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలనీ, లేదంటే వీరి ముగ్గురిని శిక్షిస్తామంటో మావోలు లేఖ రాసినట్లు సమాచారం. దీనితో తమను రక్షించాలంటూ కిడ్నాప్కు గురైన తెదేపా నాయకులు ఓ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.