శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 29 జూన్ 2018 (16:29 IST)

తెదేపాకు రాజీనామా చేస్తున్నా... నన్ను కరివేపాకులా... సీతారత్నకుమారి

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్నకుమారి టీడీపికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. లేఖలో ఆమె వెల్లడించిన వివరాలు.... ''తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధపడుతున్నాను. టీడీపి అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి..

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్నకుమారి టీడీపికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. లేఖలో ఆమె వెల్లడించిన వివరాలు.... ''తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధపడుతున్నాను. టీడీపి అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి... అంటే, 2004 నుంచి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. పార్టీ బాగు కోసం నిస్వార్థంగా పనిచేశాను. చిన్నప్పట్నుంచి తెలుగుదేశం పార్టీపై వున్న అభిమానంతో పార్టీ కోసం ఏమీ శించకుండా పనిచేస్తూ వచ్చాను. అయినప్పటికీ పార్టీ ఎన్నడూ నన్ను గుర్తుంచుకోలేదు. 
 
పార్టీ అధికారంలో వున్నప్పుడు ఒకలా... లేనప్పుడు మరోలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదనపడ్డాను. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ వదిలి అమరావతి మకాం మార్చినప్పటికీ గత నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూనే వున్నా. అన్ని వేదికలపై పార్టీకి మద్దతు పలుకుతూ డిబేట్లలో పాల్గొన్నా. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు సరికదా... ఎప్పుడూ వెనక్కి లాగేవారు. 
 
టీడీపి కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా సిన్సియర్‌గా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా... పార్టీ కోసం పనిచేసిన నాలాంటి వాళ్లను పట్టించుకోకపోవడం కలచివేసింది. ఎన్నోసార్లు పార్టీ కోసం సేవ చేసేందుకు ముందుకు వచ్చినా అవమానాలే మిగిలాయి. పైపెచ్చు పార్టీ నేతలు కొందరు నిరుత్సాహపరిచారు. మొత్తంగా పరిణామాలు చూస్తే టీడీపికి నా అవసరం ఎంతమాత్రం లేదని అర్థం చేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు సామెత ఎంతో సముచితం. బాబు గారి గురించి 40 ఏళ్ల ఇండస్ట్రీ గురించి తెలిసిన చాలామంది కరివేపాకు గురించి చెప్తారు. 
 
ఇప్పుడు నా విషయంలోనూ రుజువయ్యింది. దశాబ్దన్నర కాలంపాటు పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాను. వర్కింగ్ ఉమెన్‌గా ఉండటంతోపాటు సాఫ్ట్వేర్ ప్రొఫెనల్‌గా వున్న నేను ఎలా పనిచేశానో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుగారికి బాగా తెలుసు. ప్రస్తుతం నవ్యాంధ్ర నిర్మాణానికి నిఖార్సయిన నాయకుడి అవసరం ఎంతో వుంది. ఒక అడుగు ముందుకు వేసి, మరో అడుగు వెనక్కి వేసే నాయకత్వ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అవసరంలేదు. పక్క రాజకీయ పార్టీల నుంచి లబ్ది పొందాలనే నాయకత్వాన్ని నవ్యాంధ్ర ప్రజలు హర్షించరు. 
 
ఏం చేసామో చెప్పుకోవాల్సిందిపోయి ఇతర పార్టీలను విమర్శించి, తద్వారా ప్రయోజనం పొందాలనుకునే కుసంస్కారాన్ని టీడీపి వదలాలి. ఏపిడి ఇప్పుడు ఓ దృఢమైన నాయకుడు అవసరం ఎంతో వుంది. కేవలం రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల అవసరాలు పరిష్కరించే నాయకుడికే వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్ట కడతారు. కేవలం రాజకీయాలు మాట్లాడి, రాజకీయాలతోనే కాలం గడపాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ధి చెపుతారు. ఇప్పటికైనా రాజకీయం తక్కువ చేసి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని టిపిడి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుగారికి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాను... ఇట్లు నిమ్మగడ్డ సీతారత్నకుమారి.'' అని ముగించారు.