కేసీఆర్ ఇచ్చే చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్: షబ్బీర్ అలీ
తెలంగాణ సీఎం కేసీఆర్ అందించే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్కి ఒక లేఖ రాశినట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 3,600 చెక్కుల పరిస్థితి ఇలాగే వుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జారీ చేసిన చెక్కులే చెల్లకపోవడం విడ్డూరంగా ఉందని షబ్బీర్ అలీ హాస్యాస్పదంగా వ్యాఖానించారు.