శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:05 IST)

కేసీఆర్‌తో ఎర్రబెల్లి అర్థరాత్రి ఎందుకు భేటీ అయ్యారో?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారని సమాచారం. ఆదివారం అర్ధరాత్రి అత్యంత రహస్యంగా, సుమారు రెండు గంటల పాటు, కేసీఆర్ ఎర్రబెల్లితో ఏకాంతంగా సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
తనతో పాటు గన్ మేన్‌ను సైతం తీసుకెళ్లకుండా ఎర్రబెల్లి ఒంటరిగా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైల్-ఎల్ అండ్ టీ లేఖలు, భూముల బదలాయింపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలు పెనుదుమారం రేపుతున్న నేపధ్యంలోనే, సీఎం కేసీఆర్ తెలంగాణలో టీడీపీ ముఖ్యనాయకుడైన ఎర్రబెల్లిని పిలిపించుకుని మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.