గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:16 IST)

సింగరేణి సిగలో 'గులాబీ' పూసింది... చరిత్ర సృష్టించిన తెరాస కార్మిక సంఘం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లు ఉండగా మొత్తం 9 డివిజ

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లు ఉండగా మొత్తం 9 డివిజన్లలో విజయబావుటా ఎగురవేసింది. విపక్ష పార్టీలు కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసిన సరైన పోటీని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా విపక్షాలన్నీ చతికిల పడ్డాయి. తెరాస అనుబంధ కార్మిక సంఘం అన్ని డివిజన్లలోనూ 50 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. 
 
ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు గాను 9 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. విపక్షాలు బలపరిచిన ఏఐటీయూసీ రెండు డివిజన్లకే పరిమితమైంది. 2012లో తొలిసారి ఉద్యమ వేడిలో గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఏకంగా 9 డివిజన్లలో సత్తా చాటింది. ఫలితంగా ఈ ఏరియాల్లో గుర్తింపు సంఘంగా గౌరవం అందుకోనుంది.
 
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. 52,534 మందికిగాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు మొదలుపెట్టారు. రాత్రి బాగా పొద్దుపోయాక ఫలితాలు వెలువడ్డాయి. పోటీ పడిన అన్ని డివిజన్లలోనూ టీబీజీకేఎస్ 50 శాతానికిపైగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది. టీబీజీకేఎస్‌కు ఏఐటీయూసీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.