శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 22 జులై 2016 (17:38 IST)

రేయ్... మీ పెళ్లాల్ని తీస్కోండిరా... వాళ్ల ---- తీస్కోండి... మీడియాపై మహిళా లెక్చరర్‌ చిందులు(video)

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎస్వీ సంగీత కళాశాలలో ఒక మహిళా లెక్చరర్‌ మీడియాపై బూతు పురాణంతో రెచ్చిపోయారు. కళాశాలలో ఉన్న విద్యార్థినులను కారణం లేకుండా లెక్చరర్‌ భాగ్యరేఖ కొడుతోందని మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా ప్రతినిధులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎస్వీ సంగీత కళాశాలలో ఒక మహిళా లెక్చరర్‌ మీడియాపై బూతు పురాణంతో రెచ్చిపోయారు. కళాశాలలో ఉన్న విద్యార్థినులను కారణం లేకుండా లెక్చరర్‌ భాగ్యరేఖ కొడుతోందని మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా ప్రతినిధులు కళాశాలకు చేరుకున్నారు. మీడియా కెమెరాలను చూసిన లెక్చరర్‌ భాగ్యరేఖ మీకు ఎంత ధైర్యంరా.. నన్నే వీడియో తీస్తారా... చీరేస్తా.. ఎవరినైనా వెళ్ళి తీసుకోండి. రేయ్... మీ పెళ్లాల్ని తీస్కోండిరా... వాళ్ల---- తీస్కోండి అంటూ రాయలేని పదజాలంతో నానా హంగామా చేసింది. అసలు కాలేజీలో ఏం జరిగితే మీకేంటి... ఇక్కడ కెమెరాలన్నీ తీయకూడదంటూ రెచ్చిపోయారు.
 
అంతటితో ఆగలేదు. మీడియా కెమెరాలకు చేతిలో గట్టిగా కొట్టి కిందపడేశారు. అలాగే మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేశారు. మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియా ప్రతినిధులపై బూతు పురాణం మొదలెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు భాగ్యరేఖను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ సెంటర్‌కు తరలించారు. భాగ్యరేఖ నిర్వాకాన్ని నిరసిస్తూ విద్యార్థులు, మీడియా ప్రతినిధులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈమె గత కొన్ని నెలలుగా ఇలాగే ప్రవర్తిస్తోందంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. చూడండి ఈ వీడియోను... ఆ వీడియో మీరు కూడా  చూడండి...