శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (14:59 IST)

టీఆర్ఎస్ అంటే 'తాలిబన్ ఆఫ్ తెలంగాణ'... టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ కొత్త నిర్వచనం..

అవసరమైతే చార్మినార్‌ను కూడా కూల్చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొహ్మద్ అలీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్వం ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడిచేసి అనేక భవనాలను కూల్చాడని, చార్మినార్‌ను మాత్రం వదిలిపెట్టాడని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం దాన్ని కూడా వదిలిపెట్టకుండా కూల్చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంటుండడం దారుణమన్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా తాలిబన్ తీవ్రవాదులు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి భవనాలు కూలుస్తుంటే, వారిని మించి పోయే రీతిలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం, చెస్ట్, ఉస్మానియా ఆసుపత్రుల భవనాలను కూలుస్తున్నారని షబ్బీర్ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో ఆ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, 'తాలిబన్ ఆఫ్ తెలంగాణ' అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అచ్చం అలాగే వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.