శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 24 మే 2015 (16:51 IST)

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు దుర్మరణం..

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద వస్తుండగా ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్‌ను ఢీకొంది.
 
దీంతో వ్యాను ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.