శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:07 IST)

రాష్ట్ర సమస్యలపై బహిరంగ చర్చకు సై... చంద్రబాబుకు ఉండవల్లి లేఖ

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలోని రాజకీయ నేతలు రాష్ట్ర సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం సవాల్ విసిరిన విషయంతెల్సిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉండవల్లి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. రాష్ట్రాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరిస్తేనే రాష్ట్ర భవిష్యత్ బంగారంగా ఉంటుందని తెలిపారు.