తిరుపతిలో ఐఐటీ : ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు.. మరో ఐదు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాకుండా, 'ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961'కు సవరణ చేయడం ద్వారా ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్గఢ్లోని భిలాయ్, గోవా, జమ్మూలలో ఈ కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తారు.