శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (15:31 IST)

వెంకయ్య A1 ద్రోహి .. నాటి మాటలు ఏమయ్యాయి : కాంగ్రెస్ నేతలు

ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో గొంతుచించుకుని మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ఇపుడు ఎక్కడికి వెళ్లారంటూ వారు మండిపడుతున్నారు.
 
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య A1 ద్రోహి అని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు నిజాయితీ ఆంధ్రా ప్రజలకు బాగా తెలుసన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పని కాంగ్రెస్‌ ఒప్పుకుందని... వర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులకు బీజేపీనే కారణమని ఒప్పుకునే ధైర్యం వెంకయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు మండిపడ్డారు.