గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:19 IST)

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయమే లేదన్నారు. 
 
ప్రత్యేక ప్యాకేజీ కోసం తెదేపా పాకులాడుతోందని, ప్యాకేజీని విదేశాలకు మళ్ళించేందుకే టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క వైసిపి మాత్రమే ఎపికి రావాల్సిన అన్నింటిపైన అలుపెరగని పోరాటం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా కలిసి వెళతామన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ  ఏ మాత్రం పోరాటం చేయడం లేదన్నారు.