పగో జిల్లా రాజకీయ నేతలకు ఘన సన్మానం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రైవేట్స్కూల్స్ అండ్ కాలేజ్ మెనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని 15మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ సన్మానాన్ని స్వీకరించారు.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథుల ఆత్మీయ అభినందన సభ పేరుతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం కనుల విందుగా జరిగింది. కొత్త రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు అందరూ సహకరించాలని సన్మాన గ్రహీతలు కోరారు. జిల్లా విద్యా సంస్థల తరుపు నుంచి కొత్త రాజధాని నిర్మాణానికి సుమారు రెండు కోట్ల రూపాయలను విరాళంగా త్వరలో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.