శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (20:15 IST)

తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారు... అమృత వివాదాస్పద వ్యాఖ్యలు

పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారుతున్నాయి. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమా? ప్రేమ

పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారుతున్నాయి. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమా? ప్రేమించిన వ్యక్తి ప్రేమ ముఖ్యమా అనే అంశంపై మాట్లాడుతూ ఆమె అలా అనేసింది.
 
అసలు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం కోసమే కంటారా అని ప్రశ్నించిన ఆమె పేరెంట్స్ ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారంటూ వ్యాఖ్యానించింది. మరి ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇప్పటికే కామెంట్లు వస్తున్నాయి.