శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (19:59 IST)

కర్నూలులో తాగుబోతు భర్త పురుషాంగాన్ని కోసిన భార్య!

కర్నూలులో తాగుబోతు భర్తకు ఓ మహిళ తగిన శాస్తి చేసింది. నిత్యం మద్యం సేవించి వచ్చి తమను చిత్ర హింసలకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన ఓ మహిళ... బ్లేడుతో తన భర్త పురుషాంగాన్ని కోసివేసింది. దీంతో తేరుకున్న అతను పరుగుపరుగున వైద్యుడి వద్దకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 
 
సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు సంఘటన వివరాలు పరిశీలిస్తే కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని పొన్నాపురంలోని మహిళకు ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. వీరు పొన్నాపురంలో ఇటుక కార్మికులుగా జీవిస్తున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
ఆరుగురు సంతానానికి తండ్రి అనే విషయాన్ని కూడా మరచిపోయి... కుటుంబ పోషణ గాలికి వదిలేసి అందినకాడికి అప్పులు చేస్తూ తాగుడుకి బానిసయ్యాడు. ఎప్పట్లాగే ఆదివారం అతను పూటుగా తాగేసి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అతని తీరుతో విసిగిపోయి ఉన్న భార్య బ్లేడ్‌తో అతని పురుషాంగం కోసేసింది. జరిగిన దారుణంతో తేరుకున్న అతను ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. దీనిపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు.