శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (11:17 IST)

కృష్ణాజిల్లాలో దారుణం: భర్తను బ్లేడుతో గొంతుకోసి..?

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని బోదవాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొదవాడకు చెందిన కామేష్ (30) ను అతని భార్య లక్ష్మి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి ఆమె పరారైంది. 
 
దీనిపై స్థానికులను విచారించిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే ఆమె భర్తను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.