శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (11:26 IST)

ప్రియుడిని పెళ్లాడిందనీ విహహితను గొంతుకోసి చంపేశారు...

తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి

తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని తీపనూరు గ్రామానికి చెందిన కాటూరు అశోక్‌ అనే వ్యక్తితో ఓడూరుకు చెందిన షర్వాణీ (28) అనే యువకితి యేడాదిన్నర క్రితం వివాహమైంది. షర్వాణీ ఓడూరు రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌ ఉమన్‌గా పని చేస్తుండగా, అశోక్ గూడురులోని ఓ కంపెనలో పని చేస్తున్నాడు. 
 
అయితే, అశోక్‌‌కు పెళ్లికాకముందే వింజమూరుకు చెందిన మౌనికతో పరిచయం ఉంది. అశోక్‌కు షర్వాణీతో వివాహం జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా ఆమెను అతనికి దూరం చేసి, తాను దగ్గర కావాలని మౌనిక ప్రయత్నిస్తూనే ఉంది. అవేమీ ఫలించక పోవడంతో షర్వాణీని హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ క్రమంలో షర్వాణీ రెండు రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని ఓడూరులోనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి అశోక్ తమ్ముడు కూడా ఆ ఇంటికి వెళ్ళగా, తలుపులు వేసివున్నాయి. దీంతో ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలోనుంచి చూడగా షర్వాణీ రక్తపుమడుగులో పడివుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
 
అవేవీ ఫలించకపోవడంతో షర్వాణీ హత్యకు పథకం రచించింది. శుక్రవారం మధ్యాహ్నం ఓడూరులోని తన తల్లి వద్దకు షర్వాణీ వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షర్వాణీ మరిది సంతోశ్‌ అక్కడకు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికిలోంచి చూడగా రక్తపు మడుగులో షర్వాణీ పడివుంది. అతడు చూసేటప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా భర్త అశోక్‌ను ప్రశ్నించగా, తనకు గతంలో మౌనిక అనే యువతితో పరిచయం ఉందని, ఆమె తన తల్లి పద్మావతితో కలిసి హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశాడు. వారిద్దరిని వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడించారు.