గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:21 IST)

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చం... నితిన్ గడ్కరీ : మార్చాల్సిందే.. చంద్రబాబు

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చితే 30 శాతం వ్యయాన్ని అదనంగా భరించాల్సి వస్తుందని, ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెపుతున్నారు. అందువల్ల సబ్‌కాంట్రాక్టర్‌తోనే ఈ పనులను పూర్తి చేయిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం కానుంది… నిధులు సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నాబార్డ్ నిధులు సమకూరుస్తుందని స్పష్టం చేశారు. బిల్లులు సమర్పించిన మూడు రోజుల్లోనే 75 శాతం నిధులు సమకూరుస్తామన్నారు. పరిశీలన తర్వాత మిగతా 25 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు.