శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:32 IST)

అనంతపురం జిల్లాలో వైకాపా సర్పంచ్ దారుణ హత్య!

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ను దుండగులు తుపాకీతో అతి సమీపం నుంచి కాల్చి చంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. 
 
దీనిపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైకాపా నాయకులపై దౌర్జ్యనాలు, హత్యలు టీడీపీ నేతలే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యకు టీడీపీ నాయకులే కారణమని వారు ఆరోపించారు.