శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (11:34 IST)

స్నేహం పేరుతో వంచన... అశ్లీల ఫోటోలతో కోర్కెతీర్చమని బ్లాక్‌మెయిల్...

అతని పేరు నితిన్. బీటెక్‌ చదువుతున్నానని, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి

అతని పేరు నితిన్. బీటెక్‌ చదువుతున్నానని, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత కూడా అదేపనిగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుండటంతో ఇక భరించలేని యువతులు.. పోలీసులను ఆశ్రయించడంతో వారి గుట్టు బయటపడింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... విశాఖ మద్దిలపాలెంకు చెందిన నితిన్‌ కంచరపాలెం స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎలుకల గాయత్రి అనే యువతి ఫోన్‌ నంబర్‌‌ను తన స్నేహితుడి పేరుతో సేకరించి స్నేహం పెంచుకున్నాడు. గాయత్రికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తానని, వాటిలో అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. అందుకోసం మంచి ఫొటోలు తీయించుకోవాలని చెప్పాడు. దీంతో సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకునేందుకు గాయత్రి అంగీకరించింది. 
 
అయితే ఫొటోలు తీయించుకునే సమయంలోనూ, దుస్తులు మార్చుకునేటపుడు అశ్లీల ఫొటోలు తీసిన నితిన్‌ అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీరిస్తేనే ఫొటోలు ఇస్తానని చెప్పి గాయత్రిని లోబరుచుకున్నాడు. ఇలా దాదాపు 30 మంది యువతులను నితిన్‌ వేధించాడని పోలీసులు, బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.