శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:57 IST)

ట్విట్టర్‌లో జగన్ తొలి ట్వీట్... చంద్రబాబుపై ధ్వజం...!

ట్విట్టర్‌లో చేరిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్‌గా పెట్టినట్టున్నారు. ఆయన తొలి ట్వీట్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుపై ద్వజమెత్తారు. రైతుల వ్యతిరేక విధానాలను చేపడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. 
 
రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఉదయం ఈ ట్వీట్ చేయగా, 9:25 గంటల వరకూ, 150 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఆయన ఖాతాను 6,200 మందికి పైగా ఫాలో అవుతున్నారు.