శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:30 IST)

సమర దీక్షలో కూర్చున్న వైకాపా చీఫ్ జగన్!

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల సమర దీక్ష ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల దీక్ష ప్రారంభమైంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు... ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ తెలిపారు. రైతులను, మహిళలను తెలుగుదేశం ప్రభుత్వం వంచిస్తోందని... దీనికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్టు జగన్ తెలిపారు.
 
తొలుత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం జగన్ దీక్షలో కూర్చున్నారు. ఆయనకు సంఘీభావం తెలుపుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.