హుదూద్ ప్రాంతాల్లో జగన్ టూర్ : చంద్రబాబు సర్కారుపై ఫైర్!
హుదూద్ బాధిత ప్రాంతాల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. శనివారం విశాఖలోని తుమ్మపాల ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చెరకు రైతులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం సహకార రంగంపై వ్యవహరిస్తున్న తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు.
లాభాల్లో నడుస్తూ చెరకు రైతులకు అండగా నిలుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీలను నష్టాల బాట పట్టించడం టీడీపీ సర్కారుకు అలవాటేనని జగన్ ఆరోపించారు. నష్టాల బాట పట్టిన తర్వాత ఆయా చక్కెర ఫ్యాక్టరీలను తక్కువ ధరలకే తెగనమ్మడం కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మామూలేనని విమర్శించారు.
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని కేవలం రూ.4 కోట్లకు విక్రయించేందుకు టీడీపీ ప్రభుత్వం యత్నించగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారని వెల్లడించారు.