శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (11:07 IST)

పవన్ ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా? నాలుక కోసుకున్నారా?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై పవన్ ఆలస్యంగా స్పందించడం, ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేస్తానని చెప్పడంపై కడప వైసీపీ బీసీ కార్యదర్శి అంబకపల్లె నారాయణస్వామి, జిల్లా  సంయుక్త కార్యదర్శులు వీరభద్రారెడ్డి, చంద్రమౌళి మండిపడ్డారు. 
 
ఇప్పుడు ప్రశ్నించలేకపోతే ఇంకెప్పుడూ ప్రశ్నించలేరన్నారు. ఇకనైనా లెంపలేసుకొని రాజకీయ నటన మానుకోవాలని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఇన్ని ఘటనలు చోటుచేసుకున్నా పవన్ ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా?, నాలుక కోసుకున్నారా? లేక అధికార పార్టీలకు అమ్ముడుపోయారా? అని ఘాటుగా ప్రశ్నించారు. 
 
పవన్ లేటుగా స్పందించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించడానికి పవన్ వారం రోజులు సమయం తీసుకోవడం చూస్తుంటే టీడీపీ, బీజేపీలతో ట్యూషన్ చెప్పించుకోడానికే అన్నట్టుందని విమర్శించారు.