శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:30 IST)

పులివెందులలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు!

వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పులివెందులలో ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం లింగాలలో రక్తదాన శిబిరాన్ని అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుక్మిణిదేవి రోగులకు పండ్లు పంచిపెట్టారు.
 
జిల్లాలోని రైల్వే కోడూరు డాల్ఫిన్ స్కూల్లో వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు బ్రహ్మానందరెడ్డితో పాలు పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.