గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (12:39 IST)

జామ ఆకులను కషాయంలా తాగితే..?

జామ పండు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొందరికి తిన్న ఆహారం జీర్ణం కాక బాధపడుతుంటారు. దాంతో ఆ సమస్య నుండి బయడపడడానికి మందులు, మాత్రలు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం...
 
1. జామ ఆకులను మెత్తని పొడిలా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు కలిపి నిల్వచేసుకోవాలి. రోజూ మీరు తీసుకునే అన్నంలో కొద్దిగా ఈ పొడిని కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అజీర్తిని తొలగిస్తుంది. 
 
2. జామ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో స్పూన్ కారం, అరస్పూన్ ఉప్పు కలిపి తీసుకుంటే నోటి రుచిగా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా తింటే.. పొట్ట దగ్గరి కొవ్వు పోతుంది. 
 
3. జామ ఆకులను, 4 ఎండుమిర్చీలను నూనెలో వేయించుకుని అందులో 2 స్పూన్ల్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు, స్పూన్ ఉప్పు వేసి మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గర్భిణి మహిళలు తింటే వాంతి సమస్య ఉండదు. శిశువు ఆరోగ్యానికి కూడా మంచిది. 
 
4. జామ ఆకులను నీటిలో మరిగించి అందులో స్పూన్ ఉప్పు, కొద్దిగా పటిక బెల్లం, చిన్న శొంఠి ముక్క వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి గ్లాస్ మోతాదులో ప్రతిరోజా తీసుకుంటే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చును. 
 
5. జామ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి జామ ఆకులను శుభ్రం చేసి అందులో కొద్దిగా చింతపండు, ఉప్పు కలిపి తింటే ఆయా సమస్యల నుండి బయటపడవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.