శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:36 IST)

బిర్యానీ ఆకులు నీటిలో మరిగించి తీసుకుంటే..?

నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వచేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఇంగ్లిష్ మాత్రలు వాడుతున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. బిర్యానీ ఆకును తరచు తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈ ఆకును తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులు వేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుండి దించి 2 నుండి 3 గంటల పాటు మరిగించుకోవాలి. ఇక ఆకులను వడగట్టి సగం గ్లాస్ చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి. ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
1. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వలన డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.