శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (13:55 IST)

కలబంద గుజ్జులో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

శెనగపిండిలో పసుపు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి

శెనగపిండిలో పసుపు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత  కడిగేసుకోవాలి. దీంతో కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
పాలలో నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
కలబంద గుజ్జు తేనె, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. తద్వారా ముఖం కోమలంగా మారుతుంది. కొబ్బరిపాలలో చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మంపై గల కురుపులు తొలగిపోతాయి.