శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (10:22 IST)

భారతీయుల్లో నిజాయితీ లేదు.. పీసీ మాటలు వింటే చేతిలో చిప్పే: అరుణ్ జైట్లీ

భారతీయులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల్లో నిజాయితీ లేదని, ప్రజలు సక్రమంగా పన్నులు కట్టకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజల్‌పై భారీగా పన్నులు వేయాల్సి వస్తుందన

భారతీయులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల్లో నిజాయితీ లేదని, ప్రజలు సక్రమంగా పన్నులు కట్టకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజల్‌పై భారీగా పన్నులు వేయాల్సి వస్తుందని జైట్లు వివరణ ఇచ్చారు. వేతనజీవులు మాత్రమే సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారని.. మిగిలిన అన్ని వర్గాల వారూ నిజాయితీగా పన్ను కట్టడం లేదని అరుణ్ జైట్లీ ఆరోపించారు. 
 
ప్రజలు ఎప్పుడైతే పన్నులను సక్రమంగా చెల్లిస్తారో, అప్పటి నుంచి పెట్రోలు రేట్లు దిగివస్తాయని జైట్లు వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించే పరిస్థితి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తన ఫేస్ బుక్ పేజీలో జైట్లీ ఓ వ్యాసాన్ని రాశారు.
 
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పే మాటలు వింటే చివరికి చేతిలో చిప్ప మిగులుతుందని జైట్లీ విమర్శించారు. ఇంధన ధరలను లీటరుకు రూ. 25కు తగ్గిస్తే, భారతావని అప్పుల్లో కూరుకుపోతుందన్నారు. కాంగ్రెస్ వారు తాము చేసిన తప్పులను ఇప్పుడు ఎన్డీయేతో కూడా చేయించాలని చూస్తున్నారని జైట్లీ విమర్శలు గుప్పించారు.