శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్టు.. జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు జమ

దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జన్‌ధన్ ఖాతాలు కళకళలాడిపోతున్నాయి. ఈ ఖాతాల్లోకి గత 13 రోజుల్లో రూ.21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జన్‌ధన్ ఖాతాలు కళకళలాడిపోతున్నాయి. ఈ ఖాతాల్లోకి గత 13 రోజుల్లో రూ.21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలువగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది.
 
కాగా, నవంబర్ 9 నాటికి రూ.25.5 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న రూ.45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ.66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ.50 వేలు. కాగా జన్‌ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్‌ఐయూ) విచారణ చేపట్టింది. 
 
ఈ విచారణలో పరిమితికి మించి నగదు జమ అయిన ఖాతాదారుల వద్ద ఎఫ్.ఐ.యూతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ విచారణలో జమ అయిన నగదు నల్లధనం అని తేలిన పక్షంలో ఆ ఖాతాదారునికి ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలు రద్దు అయ్యే అవకాశం లేకపోలేదు.