శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:48 IST)

స్పీక్ ఏషియాలో స్కామ్‌లో రూ.700 కోట్ల స్కామ్ : అరుణ్ జైట్లీ

స్పీక్ ఏషియా కుంభకోణంలో 700 కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సంస్థగా ప్రారంభమై రూ.700 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసిన స్పీక్ ఏషియా కుంభకోణంలో త్వరలో కోర్టు విచారణ మొదలవుతుందన్నారు. 
 
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (భారీ మోసాలకు పాల్పడే వారిని విచారించే కార్యాలయం-ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. సింగపూర్ కేంద్రంగా స్పీక్ ఏషియా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పేదల నుంచి వేల కోట్ల రూపాయలను సంస్థ దోచుకున్న ఘటన 2011లో వెలుగులోకి వచ్చింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.