శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (15:47 IST)

భారత కరెన్సీ నోట్లపై అబ్దుల్ కలాం ఫోటోను ముద్రించాలి : నెటిజన్ల ట్వీట్స్

ఇటీవల అకాలమరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోను భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని నెటిజన్లు భారీ సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మేరకు వారు దేశ కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో అబ్దుల్ కలాం ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారు. పైగా, దేశానికి ఎనలేని సేవలు అందించిన ఈ మిస్సైల్ మ్యాన్‌కు శతకోటి భారతీయులు అందించే నిజమైన నివాళి ఇదేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.
 
 
దేశాన్ని ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం పోరాటం చేశారు. ఆ స్థాయిలో జాతిని కల్పించిన మహానేత అబ్దుల్ కలాం మాత్రమేని నెటిజన్లు పేర్కొంటున్నారు. పైగా మూడు దశాబ్దాల నుంచి దేశ ఆధునిక అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించడంలో కలాం ఎంతో కృషి చేశారని వారు కొనియాడుతున్నారు. 
 
అందుకే జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా మహాత్ముడి తర్వాత ఆయనకే దేశమంతా నివాళులర్పించింది. ఆయన అంత్యక్రియల సమయంలో జాతీయ జెండాను భౌతికకాయంపై ఉంచగా, పూర్తి సైనిక లాంఛనాలతో, వేలాది ప్రజలు 'భారత్ మాతా కి జై' అంటూ నినదిస్తుండగా అంత్యక్రియలు జరిగాయి. అంతటి ప్రేమాభిమానాలను అందుకున్న కలాంను... కరెన్సీ నోటుపై చూసుకోవాలనుకునే కోరిక నేటి యువతలో కనిపిస్తోందనడానికి ఇదే నిదర్శనం!