శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Mohan
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:25 IST)

జియో గిగా ఫైబర్‌కి పోటీగా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్

జియో గిగా ఫైబర్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు పోటీని తట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ డీటీహెచ్ సేవల సంస్థ టాటా స్కై త్వరలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జియో బ్రాడ్‌బ్యాండ్ సే

జియో గిగా ఫైబర్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు పోటీని తట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ డీటీహెచ్ సేవల సంస్థ టాటా స్కై త్వరలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చేలోగా తన సేవలను 12 నగరాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే టాటా స్కై తన సేవలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, భోపాల్, చెన్నై, గుర్గావ్ నగరాలలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపరచింది.
 
ఈ సేవల్లో భాగంగా ఫిక్సడ్ లైన్ కనెక్షన్‌ల ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు మరియు ఏడాది పాటు ప్యాకేజీల రూపంలో అందించనుంది. ఈ డేటా ప్యాకేజీలు 5 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకూ అందుబాటులో ఉంటాయి.
 
5 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ పొందాలంటే నెలకు రూ.999, 10 ఎంబీపీఎస్‌కు రూ.1,150, 30 ఎంబీపీఎస్‌కు రూ.1,500.. 50 ఎంబీపీఎస్‌కు రూ.1,800, 100ఎంబీపీఎస్‌కు రూ.2,500 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. వీటితో పాటు ఐదు అదనపు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ అందించనుంది. జియో గిగా ఫైబర్‌కు సంబంధించిన ప్లాన్‌లు ఏవీ వెల్లడించనప్పటికీ నమోదు ప్రక్రియను మాత్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాయి.