మ్యాగీ నూడుల్స్ను మళ్లీ భారత్లో ప్రవేశపెట్టనున్న నెస్లీ? ఎలాగంటే?
మ్యాగీ నూడుల్స్ను మళ్లీ భారత్లో ప్రవేశపెట్టేందుకు నెస్లే రంగం సిద్ధం చేసుకుంటోంది. మ్యాగీ నూడుల్స్కు భారత్లో కష్టకాలం ఎదురైన నేపథ్యంలో నెస్లే ఇండియా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నెస్లే తన ఇండియా విభాగానికి ఎండీగా ఓ భారతీయుడిని నియమించింది.
నెస్లే ఇండియా ఎండీగా వ్యవహరిస్తున్న ఎటియన్నే బెన్నెట్ స్థానంలో సురేష్ నారాయణన్ను నియమించినట్లు నెస్లే ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
మ్యాగీపై నిషేధం విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎదుట తమ వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కలేదని నెస్లే ఇండియా భావిస్తోంది. ఈ విషయంలో నారాయణన్ సమర్థంగా వ్యవహరిస్తారని కంపెనీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
అందుకే, నెస్లే ఫిలిప్పీన్స్కు చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్న నారాయణన్ను భారత్కు తీసుకువస్తున్నట్లు తెలిపారు. కాగా, బెన్నెట్ను స్విట్జర్లాండ్లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈయన ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్విజ్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం.