శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:11 IST)

రైల్వే కోసమే ఈ బడ్జెట్, మహిళల భద్రతకే ప్రాధాన్యం!: మంత్రి సురేశ్ ప్రభు

రైల్వే కోసమే.. రైల్వే కోసమేనన్న సూత్రం ఆధారంగానే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. మహిళల రక్షణకు బోగీల్లో సీసీ కెమెరాలు, ఫోన్ సౌకర్యం, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సురేశ్ వెల్లడించారు. 
 
రైతుల సౌకర్యం కోసం కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిన మంత్రి ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో చోటు కల్పించామన్నారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామని, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ముఖ్యంగా రైళ్లలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.