శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:46 IST)

హాట్ కేకుల్లా అమ్ముడు జియో సిమ్ కార్డులు.. ఒక్కో సిమ్ రూ.500 నుంచి రూ.1000 దాకా...

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుం

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇత‌ర నెట్‌వ‌ర్కులు వాడే వినియోగ‌దారులు కూడా రిల‌య‌న్స్ జియోపైనే మొగ్గు చూపుతున్నారు. ఒక్కో సిమ్‌ రూ.500 నుంచి రూ.1000 దాకా చెబుతున్నా హాట్‌కేకుల్లా వినియోగదారులు ఏమాత్రం ఆలోచించకుండా కొనేస్తున్నారు. 
 
కారణం.. వెయ్యి రూపాయలు పోసి కొన్నా ఆ తర్వాత డిసెంబరు దాకా అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌, ఎస్సెమ్మె‌స్‌ల ద్వారా లాభం పొందొచ్చనే ఉద్దేశంతోనే. అందునా.. జనవరి నుంచి జియో ప్యాకేజీలు ఎంత తక్కువగా అందుబాటులోకి రాబోతున్నాయో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించాక జియో సిమ్‌లకు డిమాండ్‌ మరింత పెరిగింది. జియో గురించి అంతగా వివరాలు తెలియనవారు వచ్చి వాటి గురించి ఆరా తీస్తే సిమ్‌ ఖరీదు రూ.500 అని చెబుతున్నారు. 
 
అమాయకుల దగ్గర్నుంచి ముక్కుపిండి రూ.500 వసూలు చేస్తున్నారు. కానీ, మొబైల్‌ విక్రయదారులు మాత్రం తమ దుకాణంలో అమ్మే ఎల్‌వైఎఫ్‌ ఫోన్లను ఎమ్మార్పీపై ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా అమ్ముతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ స్టోర్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ను విక్రయిస్తారని సంస్థ తెలిపింది.