శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (15:41 IST)

ఉప్పుడు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్

ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్ల వడ్లకి 20 లీటర్ల నీరు పట్టే గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో 2 లీటర్ల నీరు వేడిచేసుకోవాలి.
 
ఇప్పుడు ఆ నీటి గిన్నెమీద మూతపెట్టుకోవాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెలోంచి ఆవిరి వస్తుంటుంది, అప్పుడు కఱ్ఱ గరిటతో లేదా పొడవుగావున్న గరిటతో ఆ బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. మళ్లీ తిరిగి మూత పెట్టుకోవాలి. ఈ వడ్లు విడిపోయే వరకు వాటిని ఉడికించుకోవాలి. ఆ తరువాత బుట్టలో పోసుకుని వడగట్టి ఆ నీటిని పారేయాలి. వీటిని రెండుమూడు రోజుల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి.
 
ఆ తరువాత వాటిని ఇంట్లోగానీ, మిల్లులో గానీ పట్టించుకుని పొట్టు చెరిగేసుకోవాలి. ఒకవేళ రెండురోజుల తరువాత కూడా వడ్లు బాగా ఎండకపోతే మళ్లీ ఒక రోజంతా వాటిని మూడు గంటల పాటు అలానే ఉంచుకోవాలి. తరువాత ఎండలో బాగా ఎండపెట్టుకుని పొట్టును చెరుక్కోవాలి. ఇలా చేయడం వలం ఉప్పుడు బియ్యం చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.