శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (17:14 IST)

ధర్మశాల టెస్ట్ : ముగిసిన రెండో రోజు టెస్ట్.. భారత్ 248/6.. పుజరా రికార్డు

ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో భారత జట్టు తడబడినప్పటికీ... ఆ

ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో భారత జట్టు తడబడినప్పటికీ... ఆ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా కరుణ్ నాయర్ (5) మినహా భారత్ బ్యాట్స్‌మన్ అంతా ఆకట్టుకోవడం విశేషం. 
 
రెండో రోజు పిచ్ కాస్త ఎక్కువ బౌన్స్ అయింది. దీంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (60) పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో మురళీ విజయ్‌ను హేజిల్ వుడ్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రాహుల్‌కు ఛటేశ్వర్ పుజారా (57) జత కలిశాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతున్న దశలో అర్థ సెంచరీతో సత్తా చాటిన రాహుల్‌ను కుమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో పుజారాకు కెప్టెన్ అజింక్యా రహానే (46) జత కలిశాడు. వీరిద్దరూ రెండో సెషన్‌ను సమర్ధవంతంగా పూర్తి చేశారు. 
 
అర్థ సెంచరీ సాధించిన పుజారాను లియాన్ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే కరుణ్ నాయర్‌ను, అనంతరం రహానేను, ఆ తర్వాత రవి చంద్రన్ అశ్విన్ (30)ను వరుసగా పెవిలియన్‌కు పంపి లియాన్ భారత్‌కు షాకిచ్చాడు. క్రీజులో సాహా (10)కు జతగా రవిచంద్రన్ అశ్విన్ (16) ఉన్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగులు వెనుకబడ్డ భారత జట్టు 91 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. 
 
ఇదిలావుండగా, అద్భుత ఆటతీరుతో భారత జట్టు వెన్నుముకగా నిలుస్తున్న ఛతేశ్వర పూజారా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో ఒక సీజన్‌లో టెస్టు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పూజారా(1288) రెండో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందుకు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(1483) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పూజారా తర్వాత హెడెన్‌(1287), గంభీర్‌(1269), లారా(1253) ఉన్నారు.