భారత క్రికెట్ జట్టుకు కోచ్ కావాలి... దరఖాస్తుల ఆహ్వానం
భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పదవికి అర్హుడైన ఔత్సాహిక మాజీ క్రికెటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూన్ 10గా నిర్ణయించింది. భారత్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో జూన్ 11వ తేదీన జింబాబ్వేతో ప్రారంభమయ్యే పర్యటనకు భారత్ కోచ్ లేకుండానే వెళ్లనుంది.
'జూన్ 10లోగా కోచ్ పదవి కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది అందరికి బహిరంగ ఆహ్వానం. ప్రధాన కోచ్తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలను కూడా భర్తీ చేయనున్నాం' అని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పాడు.