శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (09:33 IST)

ధోనీ బయోపిక్: సాక్షి పాత్రలో నటించనున్న కొత్త భామ కియారా అద్వానీ!

టీమిండియా వన్డే, ట్వంటీ 20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ సినిమా తెరకెక్కనుంది. ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ధోనీ పాత్రకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (పీకే ఫేం) ఎంపిక కాగా, ధోనీ భార్య సాక్షి పాత్రకు ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్త భామ కియారా అద్వానీ సెలెక్ట్ అయింది. సాక్షి పాత్రకు చాలా మంది హీరోయిన్లను పరిశీలించామని చెప్పిన నీరజ్, కియారా అయితేనే సరిపోతుందనిపించిందని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. సాక్షి, ధోనీలను ఇంకా కలవలేదని.. తన రోల్‌కు న్యాయం చేసే దిశగా తీవ్రంగా కృషి చేస్తానని, సాక్షి పాత్రలో మెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. సాక్షి క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకుని ఈ రోల్ చేస్తానని చెప్పింది. ఇక ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని కియా అద్వానీ వెల్లడించింది.