శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (11:30 IST)

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌న

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌ను రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి.. ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ చెలరేగడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 40 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్‌ 37 బంతుల్లో 4  ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆటగాళ్లలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, జాసన్‌ రాయ్‌లను వెంటవెంటనే చాహల్‌ వెనక్కి పంపాడు. అయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ చెలరేగడంతో స్కోరువేగం పెరిగింది. 
 
శ్రేయర్‌ అయ్యర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌‌మెన్‌ అభిషేక్‌ శర్మ తన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 21 పరుగులు చేసిన విజయ్‌శంకర్‌తో కలిసి.. ఢిల్లీకి భారీస్కోరును అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలలో 181 పరుగులు సాధించింది. అయితే ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి డూ ఆర్‌ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది.