శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (16:08 IST)

నాడు బహిష్కరించారు.. నేడు ప్రోత్సహిస్తున్నారు : జగ్మోహన్ దాల్మియా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తనను బహిష్కరించిన వారే.. నేడు తనను ప్రోత్సహిస్తున్నారని ఆ సంస్థ పగ్గాలను మరోమారు చేపట్టిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) చీఫ్ జగ్మోహన్ దాల్మియా అంటున్నారు. దశాబ్దకాలం తర్వాత మళ్లీ బీసీసీఐ పగ్గాలు చేపట్టారు. 
 
దీనిపై ఆయన మంగళవారం కోల్‌కతా విమానాశ్రయంలో స్పందిస్తూ... "ఒకప్పుడు నన్ను బహిష్కరించిన వారే (క్రికెట్ బోర్డు నుంచి) ప్రస్తుతం నన్ను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు. 
 
కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంప్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అయితే దాల్మియా, ఠాకూర్ కలసి పని చేస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభ్యున్నతి కోసం ఓ జట్టుగా మేము కలసి పనిచేస్తాం" అని దాల్మియా అంటున్నారు.