శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (11:33 IST)

కిస్ కిస్ సే ప్యార్ కరూ ప్రివ్యూ షోను ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్స్

కామెడీ నైట్స్ విత్ కపిల్ టీవీ షోతో సెలబ్రిటీగా మారిన కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్‌లో ''కిస్ కిస్ సే ప్యార్ కరూ'' చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గురువారం బెంగళూరులో టీమిండియా క్రికెటర్ల కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమా ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధోనీ సహా మిగిలిన క్రికెటర్లంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశారట.
 
కాగా దక్షిణాఫ్రికా టూర్లో పాల్గొననున్న టీమిండియా క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మైదానంలోకి దూకేసిన క్రికెటర్లు కఠోర సాధన చేస్తున్నారు. 
 
రెండు ఫార్మాట్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టుకు ఎంపికైన సభ్యులంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. వీరు గురువారం కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగానే కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమాను వీక్షించారు.