గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (14:08 IST)

సచిన్ సర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయా: కుల్దీప్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయాయని టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి చెప్పుక

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోయాయని టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చాడు. టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాక.. తన లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని పేర్కొన్నారు. అప్పుడు అర్థమైంది...క్రికెట్ దేవుడు తన నుంచి ఏదో ఆశిస్తున్నారని.. అంటూ కుల్దీప్ వివరించాడు. 
 
కాగా ఆరు నెలల క్రితం జట్టులోకి వచ్చినప్పటితో పోలిస్తే కుల్దీప్ యాదవ్ తన ప్రతిభతో జట్టులో ప్రధాన ఆటగాడిగా మారాడు. ఇందుకు కారణం సచినేనని తాజాగా కుల్దీప్ ఇచ్చిన స్టేట్మెంటే తెలిసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హ్యాట్రిక్ సాధించి ఏకంగా బౌలింగ్‌లో మూడో ర్యాంకుకు ఎదిగాడు. 
 
అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్నాడు. సమీప భవిష్యత్తులో కుల్దీప్ ప్రపంచంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా మారుతాడని ఇప్పటికే మరో క్రికెట్ స్టార్ షేన్‌వార్న్ కితాబిచ్చాడు. భారత స్కిప్పర్ కోహ్లీ కూడా అతడో గొప్ప బౌలర్ అని ప్రశంసించాడు. కుల్దీప్ ఈ స్థాయికి ఎదగాడని సచిన్ ఇచ్చిన సలహానే కారణమని.. ఇందుకు అతడి శ్రమ కూడా తోడైందని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.